మాడుగులలో పల్లె పల్లె కి జనసేన కార్యక్రమం

మాడుగుల నియోజకవర్గం శ్రీ గుమ్మడి శ్రీరామ్ ఆధ్వర్యంలో పల్లె పల్లె కి జనసేన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మాడుగుల నియోజకవర్గ ప్రజలందరికీ ప్రస్తుత అధికార పార్టీ అరాచకాలను మరియు ప్రజల యోగ క్షేమాలు తెలుసుకుంటూ రాబోవు ఎలక్షన్ లో మరల ఇదే అధికార పార్టీకి అవకాశం ఇస్తే ఇంకా ఎన్నెన్ని ఘోరాలు చూడవలసి వస్తుందో పల్లె పల్లె కి జనసేన కార్యక్రమంలో గ్రామాలలో ఉన్న ప్రజలందరికి కళ్ళకు కట్టినట్లు చూపించి చెప్తున్నారు. రాబోవు రోజులలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే గౌ.శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఐతేఅయితే ప్రజలందరికీ ఎంత మేలు జరుగుతుందో గ్రామాలలో అందరికీ జనసేన పార్టీ మీద అవగాహన కల్పించడంతో పాటు అధికార పార్టీ కార్యకర్తలు సైతం జనసేన కండువా కప్పుకునేందుకు మక్కువ చూపించడం విశేషం. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలందరు నిత్యావసరాలు భారీగా పెరిగిపోయి ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం మాత్రం నిత్యావసరాల అధిక ధరలు అనే అంశం వదిలేసి మద్యం ధరలు తగ్గించి “మందుబాబులకి తక్కువ ధరకే సర్కార్ వారి మందు” అనే బాటలో అధికార పార్టీ నేతల అందరూ హడావిడిగా ఉంటున్నారు అని మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గుమ్మడి శ్రీరామ్ వాపోయారు. అధికార పార్టీ కోసం ప్రజల్లో అవగాహన తెచ్చి చైతన్య పరుస్తూ ప్రజలందరు జై జనసేన అనేలా మార్పు తెస్తున్నారు.