మడకశిరలో జనసేన నిరసన ర్యాలీ

మడకశిర నియోజకవర్గం: పవన్ కళ్యాణ్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వాలంటీర్ల తీరును ఖండిస్తూ మడకశిర నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకులు వాల్మీకి సర్కిల్ నుండి ర్యాలీగా వెళ్లి బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం రాజీవ్ గాంధీ సర్కిల్ వరకూ ర్యాలీగా వెళ్లి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మడకశిర పట్టణ అధ్యక్షుడు యశ్వంత్, మడకశిర మండల అధ్యక్షుడు శివాజీ ఐటీ కోఆర్డినేటర్ ప్రసాద్, గుడిబండ మండల అద్యక్షులు మంజునాథ్, ఆగలి మండల అధ్యక్షుడు భాను ప్రకాష్, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యుడు నాగరాజు, సీనియర్ నాయకులు పవన్ కళ్యాణ్, ఎస్.వి శ్రీనివాస్, శోహెబ్, మూర్తి, రంగనాథ్, పవన్, కళ్యాణ్, ఈరేగౌడ, నాగబుషన్, సుధాకర్, శ్రీ హరి, హరీష్, చిన్నమహేశ్, వినయ్ కుమార్, గోపి, దొడయ్య, జనసైనికులు, నాయకులు పాల్గొని నిరసన తెలిపారు.