అంగన్వాడీలకు అండగా జనసేన నందికొట్కూరు నియోజకవర్గంలో నిరసన

ఉమ్మడి కర్నూల్ జిల్లా, నందికొట్కూరు నియోజకవర్గంలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు చేపట్టిన నిరవధిక సమ్మె తొమ్మిదవ రోజున స్థానిక తహసీల్దార్ కార్యాలయ దగ్గర నిరవధిక సమ్మెకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతుఇస్తుందని జనసేన తెలుగుదేశం పార్టీల నియోజకవర్గం సమన్వయ బాద్యులు నల్లమల రవికుమార్ తెలిపారు. అలాగే అంగన్వాడీ అడుగుతున్న న్యాయమైన హామీలు వారి జీతాలు 26 వేలకు పెంచాలని, గ్రాట్యుటి, ఉద్యోగ భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని డిమాండ్ చేశారు. అలాగే సంపత్ మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యలను పరిష్కరించడం లో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం జనసేన నాయకులు మధు, బోరెల్లి వెంకటేష్, జలీల్, చిన్నా, స్వాములు రాజు, చిన్నబాబు, రేవల్లి రాజు, శంకర్, గరీబ్ బాషా, రహమతుల్లా, షబ్బీర్, సాలు బాషా, అక్బర్ వలి, మహబూబ్ బాషా పాల్గొన్నారు.