అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు నిత్యావసరాలందించిన జనసేన

ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం, వేలేరుపాడు మండలం కన్నయిగుట్ట గ్రామంలో ఈ నెల 7వ తేదీన జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 27 ఇళ్లు పూర్తిగా కాలిపోయి ఆ కుటుంబాలు రోడ్డున పడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అలాగే 15రోజుల క్రితం టేకూరు గ్రామంలో 3 ఇళ్లు కాలిపోయాయి. మంగళవారం వేలేరుపాడు మండలం, జనసేన పార్టీ మండల అధ్యక్షులు గణేశుల ఆదినారాయణ అధ్వర్యంలో జనసైనికులు అందరూ కలిసి ఆ కుటుంబాలకు తిరుమలాపురం సర్పంచి సోడే విజయ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మెచినేని సంజయ్, దేవిరెడ్డి సుధాకర్, గడిదేసి చంటి, చిచడి ప్రసాద్, సవలం నవీన్, బొద్దుల శివరాం, నూపా రాంబాబు, కొవ్వాల క్రాంతి, సవలం సన్నీ, కుడియం భాను తదితరులు పాల్గొన్నారు.