గుంటుపల్లి గ్రామంలో జనసేన రచ్చబండ కార్యక్రమం

మైలవరం: ఇబ్రహీంపట్నం మండలం, గుంటుపల్లి గ్రామం, ఎస్సీ కాలనీలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పోలిశెట్టి తేజ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ మైలవరం నియోజవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్ రావు గుంటుపల్లి ఎస్సీ కాలనీలోని యువతతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు మరియు ప్రభుత్వం నుంచి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేషన్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ప్రతి నెల మహిళల ఖాతాలో 3000 రూపాయలు జమ చేస్తామని చెప్పి ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తిరుమల శెట్టి పవన్, కొమ్మూరు వెంకటస్వామి, పగడాల బాలు, రాజేష్, జయరాం, జనసేన పార్టీ కార్యకర్తలు, మహిళలు మరియు జనసేన యువత పాల్గొన్నారు.