గోపి సేవాసమితి యువసేన యూత్ ఆధ్వర్యంలో చలివేంద్రం

గుంటూరు, తూర్పు నియోజకవర్గం, ఒకటవ వార్డులోని ఆర్టీసీ కాలనీ నందు గోపి సేవాసమితి యువసేన యూత్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ చేతుల మీదగా చలివేంద్రాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నేరెళ్ల సురేష్ మాట్లాడుతూ మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు దాహం తీర్చలనే ఆలోచనలతో జనసైనికులు అందరూ కలిసి చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని స్థానిక నాయకులను జనసైనికులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శిలు మహంకాళి శ్రీను, గోపి, ఒకటవ వార్డు అధ్యక్షులు పురుషోత్తం, దేవిశెట్టి గోపి, 12వ డివిజన్ అధ్యక్షులు కొణిదె దుర్గాప్రసాద్, నారాయణ, ఆకాష్, రాజేష్, నాగేశ్వరరావు, నగేష్, మరియు ఒకటవ వార్డు జనసైనికులు పాల్గొన్నారు.