దళితవాడలో జనసేన సంక్రాంతి సంబరాలు

బొబ్బిలి నియోజకవర్గం: తెర్లాం మండలం, పెరుమాలి గ్రామంలో జనసేన పార్టీ నాయకులు రేగానా సంబర పోలయ్య, శ్రీను ఆధ్వర్యంలో తెర్లాం మండల జనసేన పార్టీ అధ్యక్షులు మరడాన రవి అద్యక్షతన జనసేన పార్టీ ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్ శ్రీమతి తుమ్మి లక్ష్మి రాజ్ పరిశీలనలో ఆదివారం మన ఊరు మన ఆట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్య నిర్వహన కార్యదర్శి బాబు పాలూరు హజరయ్యారు. అయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తును ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ముగ్గులు పోటీలులో గెలిచిన వారికి, పాల్గొన్నవారికి అందరికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, టీడీపీ సర్పంచ్ అప్పచ్చు రాజు, వీరమహిళ ఎందువ యామిని, చందాక ఉమా మహేష్, ఆర్ పి. రాజు రేగానా సింబు, శ్రీను, యందువా సత్యన్నారాయణ, కోరగంజి సాయి, అబోతుల రాజు, శ్రీనివాస్, బూరి రామకృష్ణ నాయుడు, బలగ ఆదినారాయణ, సాకేటి కిరణ్, చీమల సతీష్, బోన్నాడ గణేష్, విజయ్, సతీష్, గొలుగువలస జనసైనికులు, తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు.