జనసేన సీనియర్ నాయకుడు జన్ని మధు మృతి పార్టీకి తీరని లోటు

అల్లూరి సీతారామ్రాజు జిల్లా, అరకు నియోజకవర్గం, అరకు వేలి మండలం సరబాగుడా గ్రామ నివాసి జన్ని మధు జనసేనపార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేసారు. అనేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లో తీసుకుని వెళ్లి అనేకమందిని జనసేనపార్టీలో ఆహ్వానించడంలో కీలక పాత్ర పోషించారు. మధు లేని లోటు ఎప్పటికి తీర్చలేనిది, మాతో కలిసి పార్టీలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికి గుర్తుంటాయి, మీ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామని కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి తెలుపుతున్నామని అరకు వేలి మండలం జనసేనపార్టీ కార్యాలయం తెలిపారు.