పాలకొండలో జగనన్న కాలనీ పరిస్థితిపై జనసేన సోషల్ మీడియా క్యాంపెయిన్

పాలకొండ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు మరియు కోరంగి నాగేశ్వరరావు జగనన్న కాలనీ పరిస్థితిపై జనసేన సోషల్ మీడియా క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. స్థానిక వెలగవాడ గ్రామంలో శనివారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జగనన్న కాలనీ స్థలాలు సక్రమంగా లేవని మరియు సొంత ఇల్లు ఉన్న వాళ్లకి కూడా ఇళ్ల స్థలాల పట్టాలు పొందారని స్థానిక ప్రజలు ఆ ప్రదేశంలో ఉండే సమస్యలను వివరిస్తూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పట్టాలు ఇచ్చి రెండు సంవత్సరాలు అయినా ఇల్లు కట్టడం ప్రారంభించడం లేదని మరియు దీని మీద ఎన్ని వేల కోట్ల స్కాములు చేశారని ప్రభుత్వాన్ని నిలదీశారు. నీటి కాలువలు మరియు స్మశానం ఉన్న ప్రదేశాల్లో స్థలాలు కేటాయించారని బాధను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.