యాక్సిడెంట్ అయిన వ్యక్తికి అండగా నిలిచిన జనసేన

గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు మండలంలోని బ్రాహ్మణ వీధిలో ఉంటున్న వడ్డెమాను లక్ష్మీనారాయణ గత కొద్ది రోజుల క్రితం యాక్సిడెంట్ అయ్యి రెండు దవడలు ఫ్యాక్చర్, కన్నుకు కూడా గాయం అయింది. అతనికి తండ్రి లేడు అతని తల్లి ఇద్దరు చిన్న చిన్న చెల్లెలు ఉన్నారు. వారికి పెద్దదిక్కుగా కూడా లక్ష్మీనారాయణ సంపాదనతోనే జీవనం సాగిస్తున్నారు. ఇతను వృత్తి రీత్యా డ్రైవర్ దవడలు ఫ్యాక్చర్ కన్ను బాగా లేని పరిస్థితులలో అతను డ్రైవింగ్ చేయలేని స్థితిలో ఉన్నాడని కొమరోలు మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు ఓబులేష్ నాయుడు తెలుపగా విషయం తెలుసుకొని నేనున్నాను మీకు సహాయం చేయడానికి అని హామీ ఇవ్వడం జరిగింది. రంగనాయకులు అతనిని నేను ఆదుకుంటానని ముందుకు వచ్చి దాత జక్కా రంగనాయకులు బీఎస్ఎన్ఎల్ మాజీ ఉద్యోగి (5000) ఐదువేల రూపాయలు అతనికి శనివారం అందజేయడం జరిగింది. జనసేన నాయకులు తోట సుబ్బారావు చేతులమీదుగా జక్కా రంగనాయకులు ఆర్థిక సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి గజ్జల కొండ నారాయణ హైదరాబాద్ దిల్షుక్ నగర్ జనసేన నాయకులు కోటిపల్లి వెంకట ప్రసాద్, మల్లారపు వెంకటేశ్వర్లు, శేషాద్రి నాయుడు, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.