స్వర్ణకారులకు అండగా జనసేన

మంగళగిరి: స్వర్ణకార సంఘం కార్పోరేషన్ ఏర్పాటు చేయాలంటు మంగళగిరిలో జరుతున్న నిరసన కార్యక్రమంకు గురువారం జనసేన మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొని తమ మద్దతు తెలిపారు. గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు పారేపల్లి మహేష్ కు అండగా తాము ఉంటామని తెలిపారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి మాటలకే విలువలు లేకుండా పోయాయని ఖచ్చితంగా రాబోయే ఎన్నికల తర్వాత ఉమ్మడి కూటమి విజయ తథ్యం ఆ కూటమి స్వర్ణకారుల అభివృద్ది కృషి చేస్తుందని చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. తాను పార్టీ ప్రతినిధి కాకుండా ఓ స్వర్ణకారుడిగా తాను కూడా ఈ కార్పోరేషన్ ఏర్పాటు చేయటం కోసం కృషి చేస్తామన్నారు. స్థానికంగా ఓ స్థలం చూపించి దాన్ని కూడా రాజకీయ కోణంలో చూపించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా తీరును తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించక తప్పదని వైసీపీ సర్కార్ కు హెచ్చరిక చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంటిఎంసీ మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ షేక్ సుభాని, మంగళగిరి పట్టణ యువజన అధ్యక్షులు షేక్ కైరుల్లా, మంగళగిరి పట్టణ 22వ వార్డ్ అధ్యక్షులు నాగులపల్లి కామేష్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.