క్రియాశీలక సభ్యుని కుటుంబానికి అండగా జనసేన

గోపాలపురం: గత వారం తీవ్ర అనారోగ్య పరిస్థితుల కారణంగా మరణించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడైన కోలా శ్రీనివాసరావు భార్య ఆదిలక్ష్మి మరియు కుటుంబ సభ్యులకు 10/02/24 వ తేదిన గోపాలపురం గ్రామంలో జనసేన పార్టీ తరపున 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఆపదలో ఉన్నవారికి, కష్టాల్లో ఉన్నవారికి చేయూత ఇవ్వాలని మా పార్టీ మరియు మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలో భాగంగా ఈ కుటుంబాన్ని దర్శించి ఓదార్చి ఈ ఆర్థిక సహాయం చేశారని జనసేన నాయకులు తెలిపారు. గోపాలపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ దొడ్డిగర్ల సువర్ణరాజు ద్వారా ఈ డబ్బులు కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు పోసిన గణపతి, గ్రామ అధ్యక్షులు వడ్డీ రామలీల, వీరమహిళ శాంతి మరియు జనసేన పార్టీ నాయకులు నరేంద్ర, సీతారాం, మణికంఠ, మల్లేశ్వరరావు, సబ్బిత శ్రీను మరియు ఉదయ్ ప్రకాష్, సీతామహాలక్ష్మి, వెంకట లక్ష్మీ, పోసమ్మ, రాధిక తదితర కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.