స్లగ్ నిర్వాసితులకు అండగా జనసేన

నంద్యాల బొగ్గులైన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. బొగ్గులైన్ గృహ నిర్వాసితులకు అండగా జనసేన పార్టీ అండగా నిలిచింది. గత 80 సంవత్సరాల కాలంగా నివాసముంటున్న నిర్వాసితుల గృహాలను అధికారులు అక్రమంగా తొలగిస్తున్నారని స్థానికులు వాపోయారు. ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి ఆసుపత్రికి మేలు కలగజేయాలని ఉద్దేశంతోనే అధికారుల అత్యుత్సాహం చూపుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని ఏళ్లు గా పేదల ఆవాసాన్ని తక్షణమే ఖాళీ చేయాలంటే కష్టతరంమని వారికి బాధ్యతగా జనసేన పార్టీ నిలుస్తుందని జనసేన నాయకులు సుధాకర్ తెలిపారు. తక్షణమే నిర్వాసితులకు అన్ని సౌకర్యాలతో ఇళ్ల స్థలాలు కేటాయించాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి స్పందించి గుడిసెలలో నివసిస్తున్న వారికి స్థలాలు, అన్ని వసతులతో కూడిన ఇళ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.