అగ్రిగోల్డ్ బాధితులకు అండగా జనసేన

విజయనగరం: అగ్రి గోల్డ్ కస్టమర్స్ & ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయనగరం జిల్లా సమితి అన్ని రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాలతో అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరమే డిపాజిట్లు చెల్లించి ఆర్థిక, మానసిక ఒత్తిడి నుండి రక్షించాలని డిమాండ్ చేస్తూ.. ఆదివారం ఉదయం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న అమర్ భవన్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో జనసేన పార్టీ తరుపున పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, దంతులూరి రామచంద్ర రాజు, త్యాడ రామకృష్ణారావు(బాలు) పాల్గొన్నారు.