పంచాయతీ సెక్రెటరీకి వినతిపత్రం అందజేసిన జనసేన

చింతలపూడి నియోజకవర్గం, లింగపాలెం మండలం నరసన్న పాలెం పంచాయితీ తిమ్మక్కపాలెం బీసీ కాలనీ నందు వాటర్ ట్యాంక్ సమస్యపై పంచాయతీ సెక్రెటరీకి వినతిపత్రం అందజేసిన మండల అధ్యక్షులు పంది మహేష్ బాబు, కార్యదర్శి పొదిల మహేష్, తిమ్మకపాలెం జనసేన నాయకులు కలువకొల్లు నాగరాజు, గుర్రం సుందరం, నంద్యాల వెంకటేశ్వరరావు. వాటర్ ట్యాంక్ వద్ద పైప్ లైన్లు లీకై ట్యాంక్ చుట్టూ బురద నీరు నిల్వ ఉండి పైపుల ద్వారా బురద నీరు గ్రామస్తులకు సరఫరా అవుతుంది. నీటిలో పురుగులు కూడా చేరడం వల్ల గ్రామస్తులు రోగాల బారిన పడతారని సమస్య పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని పంచాయతీ సెక్రెటరీని కోరడం జరిగింది. ఈ సమస్య కాకుండా గ్రామంలో సిసి రోడ్లు లేక డ్రైనేజీలు లేక వర్షాకాలం గ్రామస్తులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలియజేయడం జరిగింది. అందుకు సెక్రటరీ సానుకూలంగా స్పందించి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.