సులభ్ కాంట్రాక్ట్ కార్మికులకు జనసేన మద్దతు

తిరుపతి, మూడవ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం సులభ్ కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా జనసేన పార్టీ తరపున పార్టీ పిఏసి సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ యాజమాన్యం, అధికారులు కార్మికుల విన్నపాలు నెరవేర్చాలని, వెంటనే వాళ్ళ జీతాలు పెంచి మరియు సంవత్సరం ఇచ్చే బొనస్సులు ఇవ్వాలని, సులభ్ కార్మికులను పర్మినెంట్ చేసి వాళ్ళకి సరైన గుర్తింపు ఇవ్వాలని వాళ్ళు మనుషులే అని అంటరాని వాళ్ళలా చూడకూడదన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ సమ్మెకు మద్దతుగా పోరాటం కొనసాగించాలనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర జనసేన అధ్యక్షులు రాజరెడ్డి, తిరుపతి నగర ఉపాధ్యక్షులు పార్ధు, జిల్లా కార్యవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, జిల్లా కార్యదర్శులు ఆనంద్, బాటసారి, తిరుపతి నగర కార్యదర్శి సుమన్, లోకేష్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.