మరిపివలసలో టీడీపీ నిరసన దీక్షకు జనసేన మద్దతు

పార్వతీపురం: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
అక్రమ అరెస్ట్ కు వ్యతిరేకంగా తెలుదేశం చేపట్టిన నిరసన దీక్షకు జనసేన పార్టీ తరుపున నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ పైల సత్యన్నారాయణ మరియు సీతానగరం, పార్వతీపురం మండల పార్టీ అధ్యక్షులు పాటి శ్రీనివాస రావ్, ఆగూరు మని మరియు నాయకులు సూర్యనారాయణ, సాయి కిరణ్, ధనుంజయ్, గౌరీ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను జనసేన పక్షాన ఖండిస్తున్నాం అని, రానున్న ఎన్నికల్లో ఈ వైసీపీ ప్రభుత్వానికి చరమ గీతం పాడి జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం అని చెప్పటం జరిగింది. చివరిగా పవన్ కళ్యాణ్ నాయకత్వం మరియు చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి మరియు జనసేన – టీడీపీ ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేస్తూ ముగింపు పలికారు.