అంగన్వాడి వర్కర్స్ ఆందోళనకు జనసేన మద్దతు

సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బండి నరేష్ ఆధ్వర్యంలో బుధవారం అంగన్వాడి వర్కర్స్ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న ఆందోళనకు మద్దతుగా వారి ధర్నాలో పాల్గొనడం జరిగింది. బండి నరేష్ మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్స్ వేతనం 26 వేల రూపాయలకు పెంచాలని, అంగన్వాడి కేంద్రాలు సొంత బిల్డింగ్ లోనే ఉండాలని, అంగన్వాడి కేంద్రంలో పనిచేస్తున్న టీచర్స్ మరి ఆయాలకు ప్రమాద బీమా ఐదు లక్షల వరకు చెల్లించాలని, ఐ.సి.డి.ఎస్ లకు ప్రభుత్వ బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని, పని భారాన్ని తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు శివాజీ మిరియాల, ప్రధాన కార్యదర్శి కొమ్మగిరి శరత్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ జై చంద్రగుప్త, సోషల్ మీడియా కోఆర్డినేటర్ జబీర్ సయ్యద్, సత్తుపల్లి మండల అధ్యక్షులు ఆళ్ల నరేష్ విద్యార్థి విభాగ నాయకులు భాషా, చందు, వంశీ, మనోజ్, కార్తీక్, నాగక్రిష్ణ, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.