మదనపల్లిలో టిడిపి రిలే నిరాహార దీక్షకు జనసేన మద్దతు

మదనపల్లి నియోజకవర్గం: మదనపల్లి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ దోమలపాటి రమేష్ ఆధ్వర్యంలో మదనపల్లె తెలుగుదేశం పార్టీ నాయకులు యశస్వి తేజ్ అధ్యక్షతన ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండిస్తూ నిరసన దీక్ష చేపట్టడంతో అక్కడికి మదనపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు చేరుకుని జనసేన పార్టీ తరఫున సంఘీభావం తెలియజేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నియంత పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అరాచకాలు, అక్రమాలు, దోపిడీలు తప్ప ఈ ప్రభుత్వం వల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. జనసేన, టిడిపి కూటమి ప్రజల తరఫున పోరాడి వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్య ముగా కలిసి ముందుకు వెళ్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులతో పాటు జనసేన ఉమ్మడి చిత్తూరుజిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత మదనపల్లె సీనియర్ నాయకులు శ్రీ రామాంజనేయులు, దారం హరిప్రసాద్, తులసి శ్రీనివాస్, ఆకుల శంకర, అశ్వత్, ధరణి, శ్రీకాంత్, వీరమహిళా నాయకులు మల్లిక, రూప, శోభ, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.