సర్వేపల్లిలో టిడిపి రిలే నిరాహార దీక్షకు జనసేన మద్దతు

పెడన: టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండల కేంద్రంలో మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు శుక్రవారం మద్దతు తెలిపిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పవన్, చిరంజీవి అభిమాన సంఘాల నాయకులు, పవన్, చిరంజీవి యువత నాయకులు రిలే నిరాహార దీక్ష వద్దకు భారీగా చేరుకుని మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి, సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంఘీభావం తెలిపి రిలే నిరాహార దీక్షలో పాల్గొని చంద్రబాబు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల కారణంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ యువత, చిరంజీవి యువత అందరం రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి పనిచేస్తాం. టీడీపీ, జనసేన కలిసింది సొంత ప్రయోజనాల కోసం కాదని, రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వైసీపీ రాక్షస పాలనను అంతమొందించేందుకే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో కలిసి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించేందుకు కష్టపడి పని చేస్తాం. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు షేక్ ఖాజా రహమతుల్లా, పవన్ యువత అధ్యక్షులు అశోక్, ఉపాధ్యక్షులు రెహమాన్, జనసేన పార్టీ మనుబోలు మండల అధ్యక్షులు ప్రసాద్, పొదలకూరు మండల అధ్యక్షులు అనిల్, ముత్తుకూరు మండల నాయకులు షేక్ రహీమ్, వెంకటాచలం మండల నాయకులు పిన్నిశెట్టి మల్లికార్జున్, జనసేన సీనియర్ నాయకులు శ్రీహరి, పెంచలయ్య, సుధాకర్, సుబ్రహ్మణ్యం, జాకీర్, కోటిరెడ్డి, ఖాదర్ వలీ తదితరులు పాల్గొన్నారు.