రాష్ట్ర భవిష్యత్తు కోసమే జనసేన, టిడీపిల పొత్తు: గిరడ అప్పలస్వామి

బొబ్బిలి నియోజకవర్గం: జనసేన, టిడిపి పార్టీల పొత్తులు సందర్భంగా శుక్రవారం బొబ్బిలి నియోజకవర్గ ఇంచార్జి గిరడ అప్పలస్వామి మరియు సీనియర్ రాజకీయ నాయకులు బలగ ఆదిత్య కుమార్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన పార్టీ కలిపి పోటీ చేస్తాయని తెలిపిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరం కట్టుబడి ఉంటాం అని, ఈ పొత్తు అనేది మన రాష్ట్ర ప్రజలు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బలగ ఆదిత్య కుమార్, జనసైనికులు జమ్మూ గణేష్, ఉల్లి సంతోష్, సాయి కిరణ్, బాబు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ పొత్తు అనేది మన రాష్ట్ర ప్రజలు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పడం జరిగింది.