తవణంపల్లెలో జనసేన – టీడీపీ ఇంటింటి ప్రచారం

పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలంలో తెలుగుదేశం నాయకులు డాక్టర్. కలికిరి మురళిమోహన్ బుధవారం ఇంటింటి ప్రచారం ప్రారంభించడం జరిగింది. కారకంపల్లె పంచాయతీలో ఇంటింటి ప్రచారంను డాక్టర్ కలికిరి మురళిమోహన్ మొదలు పెట్టారు. రానున్న జనసేన – టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందించనున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు టిడిపి, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళిమోహన్, జనసేన మండల అధ్యక్షులు శివ, ప్రధాన కార్యదర్శి ఉదయ్, సీనియర్ నాయకులు మోహన్, చిన్న, యోగరాజు, రాజేష్, అజిత్, విశ్వ తేజ, లోకనాధం, పూర్ణ చంద్ర, యువరాజు, శేఖర్, విజయ్, గణపతి తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు దిలీప్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి మధుకుమార్, మాజీ జెడ్పిటీసి సభ్యులు వెంకటేష్ చౌదరి, మరియూ ఇరు పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.