మదనపల్లిలో జనసేన టిడిపి ఉమ్మడి ప్రచారం

మదనపల్లి నియోజకవర్గం: రామసముద్రం మండలంలో 39వ రోజు మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత మరియు రామసముద్రం మండల అధ్యక్షులు విజయ్ గౌడ అధ్యక్షతన రామసముద్రం ఆంజనేయ స్వామి కాలనీలో ప్రతి ఇంటికి జనసేన, టిడిపి ఉమ్మడి ప్రచారం నిర్వహించారు. జనసేన, టిడిపి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చే సంక్షేమ పథకాలు అమలు గురించి, రామసముద్రం మండలం వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, అయితే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఇపుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులు వాటిని ఇప్పటికీ అమలు చేయకపోవడం దురదృష్టకరమని, అంగన్వాడీలో దారిలోనే వాలంటీర్లు ఉద్యమం, సమ్మె చేస్తున్న వైనం ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందని అనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు.. ప్రజలు జనసేన, టిడిపి ఉమ్మడి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకుని రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.. ఈ కార్యక్రమంలో మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత, రామ సముద్రం మండల ప్రెసిడెంట్
విజయ్ గౌడ్ ప్రశాంత్ రెడ్డి యూత్ ప్రెసిడెంట్ శ్రీ కాంత్ అశోక్ కుమార్, ఈశ్వర్ రెడ్డి, చంద్రప్ప, చినుస్వామి, రమణ, సురేష్, పవన్ మదనపల్లి నియోజకవర్గం స్టూడెంట్ వింగ్ ఉపాధ్యక్షుడు జనసేన సోను, నాయకులు ధరణి రాయల్, లక్ష్మీపతి, తొక్కోల శివ, షేక్ బహదూర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.