మరణించిన బాధిత కుటుంబానికి పరామర్శ

జనసేన ఎక్స్ ఎంపిటిసి సాయిబాబా, దురియా, అల్లంగి, రామకృష్ణ, సన్యాసి రావు తదితరులు.

అరకు నియోజవర్గం, అరకు వేలి మండలం సుంకరమెట్ట పంచాయతీ పరిధిలోగల గేటు వలస గ్రామానికి చెందిన మజ్జి. ధర్మరాజు అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మరణించిన వార్త విన్న జనసైనికులు మాజీ ఎంపీటీసీ సాయిబాబా, రామకృష్ణ, సన్యాసి రావు తదితరులు గురువారము వారి స్వగ్రామం ఇంటి వద్దకు వెళ్లి వారి కుటుంబానికి పరామర్శించారు. అనంతరం ఈ సందర్భంగా సాయిబాబా, రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ… ప్రభుత్వం తక్షణమే బాధిత కుటుంబానికి ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మరణించిన బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.