బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో జనసేన-టిడిపి ఉమ్మడి భారీ బహిరంగ సభ

కళ్యాణదుర్గం నియోజకవర్గం: బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో శుక్రవారం జనసేన-టిడిపి ఉమ్మడి భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు జనసేన+టిడిపి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మరియు జనసేన పార్టీ తరపున ఇంచార్జ్ బాల్యం రాజేష్, జిల్లా కార్యదర్శులు లక్ష్మీనరసయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అదేవిధంగా బ్రహ్మసముద్రం మండలం జనసేన పార్టీ తరపున మండల అధ్యక్షులు అంజినేయులు గారితో పాటు నియోజకవర్గ జనసేన వీరమహిళలు ఇంచార్జులు షేక్ తార, మమత, కల్పన, 5 మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, నియోజకవర్గ క్రమశిక్షణ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, తదితరులు పాల్గొన్నారు.