జనసేన-తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే గెలుపు తద్యం

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం, హుకుంపేట మండలంలోని సంతారి, రాప, మత్యపురం, ఓల్డా పంచాయితీల గ్రామాల్లో జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సివేరి దొన్నుదొర పర్యటించారు. పర్యటన భాగంగా జనసేన పార్టీ హుకుంపేట మండల అద్యక్షులు బలిజ కోటేశ్వరరావు పడాల్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్ర ప్రజలకు, రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు, యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని, ప్రజలు అందరూ ఈ ప్రభుత్వాన్ని ఇపుడు గద్దె దించాలని ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈసారి రాబోయేది జనసేన-తెలుగుదేశం పార్టీలు కలిసి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని సివేరి దొన్నుదొర గెలుపు తద్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కార్యనిర్వాహక సభ్యులు పరదాని సురేష్, జన్ని లింగన్న, సోభ అర్జున్, సోభ రాంబాబు దొర,రాంబాబు సురకత్తి, పాంగి నరసింగరావు, ప్రసాద్,మురళి, ఈశ్వర్ మరియు అదిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మండల అద్యక్షులు తులసీరావు, మాజీ జెడ్పీటీసీ సుబ్బారావు, వెంకటరమణ రాజు, సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఎంపిటిసిలు, మాజీ ఎంపిటిసిలు పాల్గొన్నారు.