బీసీలకు ప్రభుత్వ నమ్మకద్రోహంపై జనసేన-తెలుగుదేశం ఐక్య పోరాటం

మదనపల్లెలో ఎన్.వి.ఆర్ కళ్యాణ మండపంలో రాజంపేట పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల జనసేన-తెలుగుదేశం సంయుక్తంగా నిర్వహించిన బీసీల సభకు ముఖ్య అతిథిగా రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి, కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్, రాయచోటి టీడీపీ ఇంచార్జి రమేష్ రెడ్డి మదనపల్లె మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా, బీసీ మీటింగ్ సభాధ్యక్షుడు తంబల్లపల్లె మాజీ ఎమ్మెల్యే శంకర యాదవ్, టీడీపీ పర్వేనుతజ్, రాజంపేట్ పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి జగన్ మోహన్ రాజు, టీడీపీ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు, నాదెండ్ల విద్య, టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు, జనసేన ఉమ్మడి ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, ఇంకా పలు బీసీ ఉప కులాల వారు, బీసీ కులాల వారికి వైసిపి ప్రభుత్వంలో జరిగిన మోసం అన్యాయం గురించి చర్చించడం జరిగింది. ఏ విధంగా రాబోవు ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోవాలని ప్రతి ఒక్కరు తమ విలువైన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది.