ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి జనసేన తోట ఓబులేసు సాయం

అనంతపురం నగరం రుద్రంపేట పంచాయతీయందు వికలాంగుల కాలనీలోని ఆంజనేయస్వామి ఆలయం నిర్మాణంలో భాగంగా జనసేన పార్టీ సింగనమల మండల అధ్యక్షులు తోట ఓబులేసు గారిని ఆలయ పెద్దలు సంప్రదించి ఆలయ నిర్మాణం కొరకు తమ వంతు బాధ్యతగా సహకరించాలని కోరడం జరిగింది. అందుకుగాను ఆలయ నిర్మాణానికి అవసరమైనటువంటి 35000/- రూపాయల విలువ గల ఎలక్ట్రికల్ వస్తువులను ఓబులేష్ తమ వంతు సహాయంగా ఆలయ నిర్మాణం కొరకు అందించడం జరిగింది. ఆలయ అభివృద్ధి కొరకు సాయం చేయదలచిన వారు ఎవరైనా ఉంటే తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని తోట ఓబులేసు కోరారు.