గిరిజన గ్రామాల్లో పర్యటించిన జనసేన

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం మండలం, ములలంక, గాదెలలంక, పెద్దూరు గిరిజన గ్రామాల్లో ఆదివారం జనసేన పార్టీ నాయకులు పర్యటించారు. గిరిజన ప్రాంతాల్లో పల్లె పల్లెకు – గూడ గూడకు జనసేన పార్టీ మ్యానిఫెస్టో మరియు సిద్దాంతాలు ప్రజలకు అర్ధమయ్యే విధంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స పుండరీకం వివరిస్తున్నారు. గిరిసేన – జనసేన కార్యక్రమంలో భాగంగా మత్స పుండరీకం మాట్లాడుతూ… సంవత్సరానికి ఐదు నుండి ఎనిమిది గ్యాస్ సిలిండర్ల ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, తెల్లరేషన్ కార్డుదారులకు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, వ్యవసాయం చేస్తున్న రైతులకు ఐదు వేల రూపాయలు పెన్షన్ సౌకర్యం జనసేన పార్టీ కల్పిస్తుందన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజల పక్షాన నిలబడిన నాయకుడు. అలాంటి నాయకుడుని ముఖ్యమంత్రి ని చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అని మత్స పుండరీకం పిలుపునిచ్చారు. మేము ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలిసి ముఖ్యంగా మహిళలకు అర్ధమైన రీతిలో జనసేన పార్టీ మేనిఫెస్టో వివరించడం జరిగిందని తెలిపారు. గత నాలుగు వారాలుగా గిరిజన ప్రజల దగ్గరకి వెళ్లి పలు కుటుంబాలను కలిసి జనసేన పార్టీ సిద్ధాంతాలు గురించి వివరంగా చెప్పడం జరిగింది. గిరిసేన – జనసేన కార్యక్రమం ద్వారా ప్రజలునుండి అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇచ్చామని ఓటేసిన పాపానికి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయని, రేషన్ బియ్యం మాత్రం ఇస్తున్నారు ఇంకేమి ఇవ్వడం లేదని, గిరిజన ప్రాంతాల్లో పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేవని అలాగే స్థానికంగా పనులు లేక సుదూర ప్రాంతలకు వలసలు వెళ్లిపోతున్నము అని గిరిజన మహిళలు జనసైనికులకు చెప్పారు. వీటికి మత్స పుండరీకం సమాధానం ఇస్తూ జనసేన పార్టీ మేనిఫెస్టోలో గిరిజన ప్రాంతాల్లోని ఆహార పంటలకు, గిరిజన ఉత్పతులు తయారు చేసేందుకు స్థానికంగా ఉంటూ ఉద్యోగ, ఉపాధి కల్పన కల్పిస్తుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో గాజుగ్లాస్ గుర్తు కి మీ అమూల్యమైన ఓటును వేసి జనసేన పార్టీ గెలిపించాలని గిరిజన మహిళలను కోరారు. గిరిసేన – జనసేన కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు కర్నేన సాయి పవన్, కోడి వెంకటరావు నాయుడు, బి.పి.నాయుడు, అన్ను రామకృష్ణ, వావిలిపల్లి నాగభూషణ, దండేల సతీష్ పాల్గొన్నారు.