జనసేన విజయ యాత్ర – ఏపి నీడ్స్ పవన్ కళ్యాణ్

  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన ఇంఛార్జి వినుత కోటా ఇంటింటికీ ప్రచారం 30వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు శ్రీకాళహస్తి నియోజకవర్గం, శ్రీకాళహస్తి మండలం, తొండమాన్ పురం పంచాయతీ లోని మిట్ట వీధి , ఎగువ వీధి గ్రామాల్లో ఈ రోజు ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదు సుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ది కి సహకరించాలని కోరడం జరిగింది. నిత్యావసర ధరలు పెంపు, గ్యాస్, కరెంట్ బిల్లులు పెంపు సామాన్యులకి గుదిబండ లా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన ప్రభుత్వంలో అన్ని ధరలు సరలిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ రామిశెట్టి, నాయకులు గణేష్, రవి కుమార్ రెడ్డి, పేట చంద్ర శేఖర్, లక్ష్మి, రాజ్య లక్ష్మి, కవిత, శారద, పేట చిరంజీవి, గురవయ్య, మునయ్య, సురేష్, వినోద్ కుమార్, నితీష్ కుమార్, ఉదయ్, దుర్గ జనసైనికులు దాము, ఆది, జయ ప్రకాష్, పవన్ కుమార్, తరుణ్, నితీష్, వెంకటేష్, చందు, మదు, ముని చరణ్, వినయ్, హేమంత్, తులసీ, గోపి తదితరులు పాల్గొన్నారు.