కే వెంకటాపురం గ్రామములో జనసేన గ్రామకమిటీ ప్రకటన

పాయకరావు పేట నియోజవర్గం, కోటవురట్ల మండలం, కే వెంకటాపురం గ్రామములో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు బుధవారం గడ్డం బుజ్జి మరియు బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీలు నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు గొల్ల బాలరాజు, ఉపాధ్యక్షుడు అశోక్ రెడ్డి ప్రధాన కార్యదర్శి స్వామి మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గడ్డం రాజు, సింగంపల్లి వరహాల బాబు, గొల్ల స్వామి ,గొల్ల నవీన్, భీమిరెడ్డి శివాజీ, గడ్డం శ్రీరామ్ మూర్తి, తమన్నా రా చిరంజీవి, కామిరెడ్డి రాజు, తమన్నా రా శివాజీ, రమణ మరియు గొల్ల నాయుడు పాల్గొన్నారు.