అగ్నిబాధిత కుటుంబాలను పరామర్శించిన జనసేన

అమలాపురం: అమలాపురం రూరల్ మండలం, ఏ వేమవరం గ్రామంలో ఇటీవల అగ్నికి ఆహుతై నిరాశ్రయులైన కుటుంబాలను శుక్రవారం జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు పరామర్శించారు. ఒక్కొక్క ఇంటికి ఐదు వేల రూపాయలు వంతున నగదు అందజేశారు. ప్రభుత్వం తక్షణమే వారికి పక్కా ఇళ్ళు నిర్మించాలని, లేనిపక్షంలో జనసేన పార్టీ వారి ఇళ్ళు నిర్మాణం చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజబాబు తో పాటు గ్రామ సర్పంచ్ రావూరి భాస్కరరావు, దుర్గా బుజ్జి, రాకుర్తి సుబ్బారావు, రాకుర్తి హరి, లింగోలు నారాయణరావు, చిత్రపు జయరాజు, జనసేన పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి సందాడి శ్రీనుబాబు, కార్యదర్శి చిక్కాల సతీష్, సంయుక్త కార్యదర్శి చిక్కం భీముడు, నాయకులు ఆకుల బుజ్జి, చిక్కం సూర్యమోహన్, మంచిగంటి మాచారరావు, పినిశెట్టి సురేష్, పొణకల ప్రకాష్, మామిళ్లపల్లి దొరబాబు, సత్తి శ్రీనివాస్, అరళ్ళపల్లి దుర్గ, మహమ్మద్ షరీఫ్, నిమ్మకాయల మను, వీరమహిళలు గోళ్ళ కమల తదితరులు పాల్గొన్నారు.