కట్టువపల్లి గ్రామంలో అధ్వాన స్థితిలో ఉన్న ప్రాదమిక పాఠశాలను సందర్శించిన జనసేన

సూళ్లూరుపేట నియోజకవర్గం, దొరవారి సత్రం మండలం, కట్టువపల్లి గ్రామంలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాల గురించి అక్కడ ఉన్న మండల అధ్యక్షులు దువ్వూరు సనత్ కుమార్, మరియు జనసైనికులు తెలపడంతో అక్కడికి పర్యటించి హరిజనవాడ ప్రాథమిక పాఠశాలను సందర్శించడం జరిగింది. ప్రాథమిక పాఠశాల ఎంత దారుణమైన స్థితిలో ఉంది పిల్లలు పాఠాలు నేర్చుకోవాల్సిన గదిలో గేదెలు మూత్రము , మందుబాబుల గ్లాసులతో తరగతి గదులు నిండి ఉన్నాయి. ఇదివరకే స్కూలు సందర్శించిన అధికార పార్టీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య స్కూల్ బాగు చేస్తామని ఇచ్చి మూడు సంవత్సరాలు గడిచిందని, కనీసం అటు వైపు చూడలేదని గ్రామస్తులు జనసైనికులు తెలిపారు. ఇక్కడ పిల్లలు చదువుకోడానికి దొరవారిసత్రం హై స్కూల్ కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారని అతి త్వరలో స్కూల్ గురించి అధికారులను కలిసి వినతిపత్రం అందజేసి ఈ స్కూల్ బాగుచేసే వరకు జనసేన పార్టీ నిరంతరం కృషి చేస్తుంది. అలాగే మన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం రేపు ఒక్కరోజు మాత్రమే ఉండటంతో జనసైనికులకు సభ్యత్వం గురించి వివరించి వారిని సభ్యత్వం చేసుకునే విధంగా మోటివేట్ చేయడం జరిగింది. అందరూ కచ్చితంగా చేసుకుంటామని చెప్పడం జరిగింది.