సిధ్ధవటం ఎమ్మార్వోకి వినతిపత్రమిచ్చిన జనసేన

కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, సిధ్ధవటం, వైసీపీ వారు గుడిని గుడిలో ఉన్న లింగాన్ని మింగుతుంటే ఈ టీడీపీ వారు దేవాలయాల పక్కన భూములు ఆక్రమించి పార్టీ ఆఫీసు కొరకు శంఖుస్థాపన చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు కూడా దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు న్యాయం చేసేదేమి లేదు. సిధ్ధవటంలో శ్రీకృష్ణ దేవరాలయల హయాంలో శ్రీ రంగనాధ స్వామి ఉంది. అక్కడ చుట్టు పక్కల ఖాళీ స్థలం ఉంటే అక్కడ దైవ భజనలకు పార్కింగ్ కు ఉపయోగించేవారు. కానీ ఇపుడు టీడీపీ వారు 50 సెంట్లు ఆక్రమించి సర్వే నంబరు 404, 405 పేరు మీద అనుసందాన పత్రము పుట్టించి 20 సెంట్లలో టీడీపీ ఆఫీసు కడుతున్నారు పక్కనే విద్యార్ధుల హాస్టల్ కూడ ఉంది. గుడి, పాఠశాల లకు 100 మీటర్ల దూరం వరకు రాజకీయ పార్టీ ఆఫీసు పెట్టకూడదు అనే జ్ఞానం లేకుండా పార్టీ ఆఫీసు ఏర్పాటు చేయడం ఎంతవరకు న్యాయం అని మండల ఎమ్మార్వో కి సిధ్ధవటం మండల జనసేన నాయకులు కొట్టే వెంకట రాజేష్ ఆధ్యర్యంలో వినతిపత్రం అందించి టీడీపీ వారిపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. మీరు త్వరగా పరష్కరించకపోతే గ్రామ ప్రజవకోసం పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేస్తామని జనసేన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులతో పాటు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.