ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులకు జనసేన అండగా ఉంటుంది: దారం అనిత

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పశ్చిమగోదావరి జిల్లా లో చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడానికి అదేవిధంగా రైతు కుటుంబాల లో ధైర్యం నింపడానికి చేపట్టిన రైతు భరోసా భరోసా యాత్ర కార్యక్రమం విషయం అందరికి తెలిసిందే.. అందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాకి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అన్న విషయం తెలిసి శుక్రవారం ఉదయమే చింతలపూడి నియోజకవర్గం ధర్మాజీ గూడెం వద్ద రోడ్లను పొక్లైనర్లతో తవ్విస్తుండగా.. జనసేన పీఏసీ చర్మైన్ నాదెండ్ల మనోహర్, జనసేన నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ అండగా వుంటారని చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత ఈ సందర్భంగా పేర్కొన్నారు.