బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి జనసేన ముందుంటుంది: తంబళ్ళపల్లి రమాదేవి

చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలంలోని జనసేన పార్టీ ఐరాల మండలాధ్యక్షుడు పురుషోత్తం ఆధ్వర్యంలో శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి ఐరాల మరియు రత్నగిరి దళిత వాడలలో పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. అక్కడి అఖిలపక్ష దళిత నాయకులు రమాదేవితో సమావేశమై, వై.సి.పి ప్రభుత్వం దళితుల యొక్క హక్కులను కాలరాస్తున్న తీరుపై చర్చించి, వచ్చే ఎన్నికల్లో వై.సి.పి గట్టిగా బుద్ధి చెప్పాలని, దళితులు అంతా కలిసి జనసేన పార్టీకి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. తంబళ్ళపల్లి రమాదేవి మాట్లాడుతూ ఎస్సి,ఎస్టి సబ్ ప్లాన్ నిధులను మళ్లించడం వల్ల దళితుల అభ్యున్నతి పట్ల వై.సి.పి ప్రభుత్వ వ్యతిరేకతను వివరించి, ఏ రాజకీయ పార్టీ దళితులకు కేటాయించిన నిధులను ఈ విధంగా దుర్వినియోగం చేయలేదని ఆమె అన్నారు. జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపిస్తే బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి జనసేన ముందుంటుందని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన చిత్తూరు జిల్లా స్పోక్స్ పర్సన్ మునిరాజులు, మరియు ఇతర పార్టీల నేతలు పాల్గొన్నారు.