జనసేన యువశక్తి కార్యక్రమం కార్యాచరణ సమావేశం

శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో ఆదివారం 2023, జనవరి 12వ తేదీన జరగనున్న జనసేన యువశక్తి కార్యక్రమం విజయవంతం చేయుటకు భీమిలి జనసేన పార్టీ కార్యాలయంలో పబ్లిసిటీ కమిటీ కన్వీనర్ గేదెల చైతన్య మరియు జాయింట్ కన్వీనర్ వబ్బిన సత్యనారాయణ (సత్తిబాబు) ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సభ్యులు జనసేనాని పాల్గొనే యువశక్తి సభకు అత్యధిక యువత పాల్గొనేందుకు ఏ విధంగా ప్రచారం చేయాలనే అంశంపై చర్చించి వెంటనే అమలు చేయుటకు ప్రచార కమిటీని సిద్దంచేసారు. ఈ కార్యక్రమంలో పబ్లిసిటీ కమిటీ సభ్యులు గవర సోమశేఖర రావు, మరపు సురేష్, పోలరౌతు వెంకటరమణ, కాధ శ్రీను, ఎర్ర నాగుల చక్రవర్తి, వీరమహిళ శ్రీమతి మక్కా షాలిని, నీరుకొండ దివాకర్, కొర్నాన రామకృష్ణ, పిల్ల శ్రీను మరియు ఇతర జనసైనికులు పాల్గొన్నారు.