ఇన్స్యూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని చెల్లించిన జనసేనాని

జనసేన క్రియాశీలక కార్యకర్తలకు చెందిన ఇన్స్యూరెన్స్ ప్రీమియం (2022 – 2023 సంవత్సర కాలానికి) మొత్తాన్ని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ సి జి ప్రసాద్, డి జి ఎం కు చెక్ ను గురువారం ఉదయం తన నివాసంలోఅందించారు. ఈ ఇన్స్యూరెన్స్ ఏప్రిల్ ఒకటి 2022 నుంచి అమలులోకి వస్తుంది. ఈ సమావేశంలో పార్టీ ఇన్స్యూరెన్స్ పాలసీ సలహాదారు వెంకట నరసింహారావు యడ్ల, మరియు పార్టీ కోశాధికారి ఎ.వి. రత్నం పాల్గొన్నారు.