నంద్యాలలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

నంద్యాల నియోజకవర్గం: నంద్యాలలో పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్బంగా జనసేన అధ్వర్యంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. దాదాపు 100 మందికి పైగా జనసేన నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు పిడతల సుధాకర్ మాట్లాడుతూ మా నాయకుడు పవన్ కళ్యాణ్ ను సిఎం కుర్చీలో కూర్చోబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తామని, పవన్ కళ్యాణ్ ను సిఎంను చేసేందుకు ప్రతి జనసేన కార్యకర్తలు, సైనికుల్లా పనిచేయాలని కోరారు. రక్తదానం చేసిన ప్రతి అభిమానికి రక్తదాన సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సందీప్, రవి, సురేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.