ములంపాక అప్పారావు దంపతుల ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన వేడుకలు

విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శనివారం మెగా రక్తదాన శిబిరం జనసేన పార్టీ 61 వార్డు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ జనసేన నాయకులు ములంపాక అప్పారావు, శ్రీమతి నాగవేణి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. అనంతరం కేకును కట్ చేసి జనసేన నాయకులకు, వీరమహిళలకు మరియు జన్సైనికులకు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాజువాక జనసేన పార్టీ ఇంచార్జ్ కోన తాతారావు, శంకర్, తులసి, వంశీ, మోహన్, అభి, నాగు, ప్రేమ్, సంతోష్, శ్రీను, కోటి, జనసేన నాయకులు వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు వీర మహిళలు జనసైనికులకు ధన్యవాదములు తెలిపారు.