భైంసాలో ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

భైంసా: భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనం ముందర జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. వేడుకలలో భాగంగా పవన్ కళ్యాణ్ పేరిట గుడిలో పూజలు నిర్వహించి, కేక్ కట్ చేసి, నిరుపేదలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జన సేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కౌలురైతులతో పాటు పేదలు, బడుగుబలహీనవర్గాలకు అండగా నిలబడి పవన్ కళ్యాణ్ ఆదిశగానే సేవలందిస్తున్నారు. సినిమాల ద్వారా వచ్చిన తన రిమ్యూనరేషన్‌ను కూడా కౌలు రైతులకు అందజేసిన గొప్ప మనసున్న మారాజు అదేవిధంగా రాజకీయాల్లో నిరంతరం వారాహి ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చి కష్ట సుఖాల్లో నేనున్న అనే దైర్యం కలిగించిన మా అధినేత నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, గడపాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో జన సైనికులు రామోజివార్ గంగ ప్రసాద్, రాజు, అర్జున్, విద్యాసాగర్, వికలాంగులు సంఘం నాయకులు రాజు, భోజా రెడ్డి, తిరుమల, లక్ష్మి ఆటో యూనియన్ నాయకులు ముత్యం, ప్రకాష్, భోజన్న, పోషెట్టి, సాయన్న తదితరులు పాల్గొన్నారు.