నిడదవోలులో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

నిడదవోలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నిడదవోలు మండలం విజ్జేస్వరం గ్రామంలో ముందుగా డాక్టర్.బి.అర్. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఆ తరువాత కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మండల జనసేన నాయకులు నార్ని తాతాజి ఆధ్వర్యంలో నిర్వహించిన (అన్నవరప్పాడు నుండి నిడదవోలు శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానం వరుకు) పాదయాత్రలో పాల్గొని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని పాదయాత్ర చేపట్టి అమ్మ వారి ఆశీస్సులు తీసుకున్న నిడదవోలు మండల జనసేన. పందలపర్రు గ్రామ అధ్యక్షులు కర్రి వినోద్ ఆధ్వర్యంలో ఐ క్యాం నిర్వహించడం జరిగింది. తిమ్మరాజుపాలెం శ్రీ కోట సతెమ్మ అమ్మవారి దేవస్థానంలో జనసేనాని పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. నిడదవోలు చర్చ్ లో ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది. నిడదవోలు మసీదులో అల్లా ఆశీస్సులు ఎల్లవేళలా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ఉండాలని నమాజ్ చేసి ప్రార్ధనలు నిర్వహించడం జరిగింది. నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన జనసేన. అనంతరం మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పోలిరెడ్డి వెంకట రత్నం మరియు నార్ని తాతాజి, నియోజకవర్గ జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.