వైసీపీని గద్దె దించడమే జనసేన లక్ష్యం: రాటాల రామయ్య

*2024లో పవన్ కళ్యాణ్ సీఎం…

*జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య

రాజంపేట: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే జనసేన పార్టీ లక్ష్యమని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు ఆదివారం రాజంపేట జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం నందు జనసేన యువ నాయకుడు పోలిశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పండగ వాతావరణంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన రాష్ట్ర నాయకులు తాతంశెట్టి నాగేంద్ర, సయ్యద్ మొఖరం చాంద్, రాటాల రామయ్యలు హాజరై జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు కిట్లు అందజేశారు. అనంతరం క్రియాశీలక సభ్యత్వం చేయించిన వాలంటీర్లకు శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి నుంచి జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేసే ప్రతి ఒక్కరికి క్రియాశీలక సభ్యత్వం ఇచ్చి వారికి ఐదు లక్షలరూపాయల బీమా పత్రాలను అందించడం జరిగిందని తెలియజేసారు.