అంబటి వ్యాఖ్యలకు జనసేన వినూత్న నిరసన

  • పవన్ కళ్యాణ్ ను నోటికొచ్చినట్లు మాట్లాడితే నీ పరిస్థితి అధోగతే గుర్తుపెట్టుకో అంబటి – జనసేన
  • అంబటి రాంబాబు హీరోగా ఎస్.ఎస్.ఎస్ నూతన సినిమా ప్రారంభోత్సవం
  • ఘనంగా జరిగిన పూజ కార్యక్రమంలో పాల్గొన జనసేన నాయకులు

తిరుపతి: జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ప్రొడెక్షన్ నెంబర్ 6093 జగ్గుబాయ్ సమర్పించు సందులో సంబరాల శ్యామ్ బాబు అనే నూతన సినిమాకు తిరుపతి ఇంచార్జి కిరణ్ రాయల్ క్లాప్ కొట్టి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై వినూత్న నిరసన తెలిపారు.. అంబటి వేషధారణలో వచ్చిన జనసేన నేత, పూజలు చేసి రాజారెడ్డి, హిమవంత్, ఆకేపాటి సుభాషిని, కీర్తన, అరుణ, శేషారత్నం, కొండా రాజమోహన్, మునస్వామి, గోపి స్వామి, హేమ కుమార్, రాజేష్ ఆచారి, కిరణ్, గుట్టా నాగరాజు, మనోజ్, కిషోర్, సాయి దేవ్, వినోద్, పవన్, ఆది కేశవులు, పురుషోత్తం, సాయి, శంకర్, విశ్వ మరియు జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులతో ఎస్. ఎస్. ఎస్ అనే నూతన చిత్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్, రాజా రెడ్డి నాయకులు మాట్లాడుతూ.. అంబటి రాంబాబుకు పిచ్చెక్కిందని, తన శాఖపై పట్టులేని వ్యక్తి అంబటి రాంబాబు అని, అంబటి నోరు అదుపులో పెట్టుకోకుంటే మీ ఇంటిని ముట్టడిస్తాం అని, అంబటి పర్యటనలను అడ్డుకుంటాం అని, ఈ సినిమా తరవాత త్వరలోనే త్రిబుల్ ఎక్స్ సినిమాను అంబటి రాంబాబుతో తీస్తాం అని, హీరోయిన్ దొరకడం లేదని, మా అధినేత పవన్ కళ్యాణ్ ను నోటికొచ్చినట్లు మాట్లాడితే గుర్తుపెట్టుకో నీ పరిస్థితి అధోగతేనని, ఏరోజైనా నీ పదవీకాలంలో నీ శాఖకు సంబంధించి ఎన్ని పనులు పూర్తి చేశావో ప్రజలకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పావా అని, మా సినిమాల కలెక్షన్ గురించి చెప్పడం ఆపేసి ముందు నీ శాఖపై దృష్టి సారించి, ప్రజలకు మేలు చేసే దిశగా ఆ భగవంతుడు నీకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.