అనంత సాగరం మండలంలో జనసేన జోరు

  • జనసేన పార్టీ ఇన్చార్జి నలిశెట్టీ శ్రీధర్

ఆత్మకూరు: అనంత సాగరం మండలంలోని కామిరెడ్డి పాడు గ్రామంకి ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి జనసేన నాయకుల పిలుపు నలిశెట్టీ శ్రీధర్ మేరకు విచ్చేశారు. వారిని పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు కె ఎస్ భరత్, మండల అధ్యక్షులు రవి ఉదయగిరి బీసీ సెల్ మండల అధ్యక్షులు బాల చంద్ర యాదవ్ స్వాగతం పలికారు. అనంతరము బైక్ ర్యాలీ నిర్వహించి, చెన్న కేశవ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. బీసీ సెల్ అధ్యక్షులు బాల చంద్ర యాదవ్ కుటుంబం హారతి ఇచ్చి శ్రీధర్, కె ఎస్ భరత్, రవి ఉదయగిరిలకు సన్మానం చేశారు. బాల చంద్ర యాదవ్ మరియు ఎస్సీ సెల్ అధ్యక్షులు కానగల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కామిరేడ్డి పాడు గ్రామం మరియు మంగుపల్లి గ్రామాల నుండి 40 మంది యువకులు జనసేన పార్టీలో చేరడం జరిగింది. స్థానిక టిడిపి నాయకులు జన్నిబోయిన వీర మల్లేశ్వర రావ్ యాదవ్, కత్తి నరసింహులుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ యువత వేణు గుడిపాటి, జనసేన నాయకులు జేపీ రాయల్, వంశీ సురేంద్ర, శివ, చంద్ర తదితరులు పాల్గొన్నారు.