పాలకొండలో పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయండి!

పాలకొండ నియోజకవర్గంలో గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ముందస్తు కార్యక్రమాలు నిర్వహణ దృష్ట్యా జనసేన జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, జనసేన పరిశీలకులు వంపూరు గంగులయ్య, పాలవలస యశస్వి, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్తిబాబు, ఉమ్మడి జనసేన పార్టీ అభ్యర్థి నిమ్మక. జయకృష్ణ హెలిపాడ్ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో, జనసేన నేతలు మాట్లాడుతూ… రేపు గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పాలకొండ పర్యటన ఉంటుందని, రేపు ఆ పర్యటనలో భాగంగా ఎస్ బి ఐ బ్యాంక్ దగ్గర శ్రీకాకుళం రోడ్లో, వారాహి సభలో పాలకొండ నియోజకవర్గ సమస్యలను ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ఉంటుందని అన్నారు. అనంతరం మీడియాతో ఉత్తరాంధ్ర జనసేన పార్టీనిర్వహణ కోకన్వీనర్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్తిబాబు, మాట్లాడుతూ.. రేపు జరగబోయే వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం ప్రతిష్టాత్మకంగా ఉంటుందని, ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంపై ఆయన సుదీర్ఘ అనుభవం దృష్ట్యా, శ్రీకాకుళం పాలకొండ నియోజకవర్గం వెనకబాటు మరియు సమస్యలు, భూ కబ్జాలపై ఆయన మాట్లాడుతారని, ఆయన అన్నారు. అలాగే రేపు జరగబోయే పర్యటనలో జనసేన పార్టీ, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో జనసేన, తెలుగుదేశం, భాజపా నేతలు పాల్గొన్నారు.