ఏ.బి.సి వర్గీకరణ నిరసన దీక్షకు జనసేన మద్దతు!

మదనపల్లి నియోజకవర్గం: పీలేరు పట్టణం నందు తసీల్ధార్ కార్యాలయం దగ్గర ఏ.బి.సి వర్గీకరణకు నిరసన దీక్షలు చేపట్టిన ఎం.ఆర్.పి.యస్, బి.యస్.పి నాయకుల దీక్ష శిభిరానికి వారు చేస్తున్న దీక్షకి మద్దతుగా పీలేరు జనసేన పార్టీ ఇంచార్జి బెజవాడ దినేష్ మరియు రాయలసీమ కో కన్వీనర్ మరియు మదనపల్లి జనసేన పార్టీ ఇంచార్జి రాందాస్ చౌదరి, అన్నమయ్య జిల్లా జనసేన నాయకుడు రామ శ్రీనివాస్, జనసేనపార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాం, కె వి పల్లి మండల అధ్యక్షుడు మహేష్, పీలేరు జనసేన పార్టీ నాయకుడు రెడ్డప్ప, రెడ్డి కిషోర్, పవన్ కుమార్, గజేంద్ర, వెంకట్, మదనపల్లె జనసేనపార్టీ పట్టణ, గ్రామీణ అధ్యక్షులు బాబు, జగదీష్ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.