జనంలోకి జనసేన పట్టణ బాట

మదనపల్లి, నీరుగట్టు వారిపల్లిలో పురం నగేష్ ఆధ్వర్యంలో ఆదివారం జనంలోకి జనసేన పట్టణ బాట నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరికి పలికిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలకడం జరిగంది. ఈ సందర్భంగా గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ 34 వ వార్డులో గత మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీచేసి జనసేన పార్టీ కోసం నిరంతరం కష్టపడే నిబద్ధత కలిగిన నాయకుడు పురం నగేష్ అని మున్సిపల్ ఎన్నికలలో ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగని నాయకుడని, ఇంటింటా అపూర్వ స్పందన వచ్చిందని వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్, వైసీపీ విముక్త మదనపల్లె, వైసీపీ విముక్త రాజంపేట పార్లమెంటు ధ్యేయంగా జనసేన పని చేస్తోందని ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి అమాయకులపై దాడులు దౌర్జన్యాలతో పాలన సాగిస్తున్న వైసిపికి కాలం చెల్లిందని ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చేనేత కార్మికుల సమస్యలను గురించి అడిగి తెలుసుకొని జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే చేనేత కార్మికుల సమస్యలు తీరుతాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర, రూరల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు, చంద్రశేఖర, గడ్డం లక్ష్మిపతి, అర్జున, జవిలి మోహన్ కృష్ణ, నాగ, రాజా రెడ్డి, నరేష్, కల్లూరు లక్ష్మినారాయణ, రెడ్డి శేఖర్ రెడ్డి, నవాజ్, జనార్దన్, నాగరాజు, హరిబాబు, నరసింహ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.