జనానికి భరోసా కల్పించేందుకే జనసేన పర్యటన
తిరుపతి స్కావెంజర్స్ కాలనీలో(చెంచులు) యానాదులకు నిత్యావసరాల పంపిణీ
మా జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తుఫాను వరద ముంపు ప్రాంతాలను సందర్శించడానికి నిరాశ్రయులైన వారికి నిత్యావసరాల పంపిణీ చేసేందుకు మేమున్నామంటూ.. భరోసా కల్పించే దిశగా తాము పయనిస్తున్నామని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం స్థానిక దేవేంద్ర థియేటర్ మార్గంలోని స్కావెంజర్స్ కాలనీలో పేదలకు నిత్యావసర వస్తువులను అందజేశారు. సాయంకాలం ఈ పర్యటనలో జనసేన నేతలు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ తదితరుల నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-23-at-6.18.25-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-23-at-5.15.39-PM-1-1024x461.jpeg)