పలు కుటుంబాలను పరామర్శించిన జాన్ బాబు

  • సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన జాన్ బాబు

పి.గన్నవరం నియోజకవర్గం: యర్రంశెట్టి వారిపాలెం గ్రామానికి చెందిన చాగంటి వీరవెంకట సత్యనారాయణ సతీమణి లక్ష్మీదేవి(38) అకస్మాత్తుగా మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు పెనుమాల దేవి జాన్ బాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనంతరం యర్రంశెట్టివారిపాలెంలోని వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించి, ఓదార్చారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి పెనుమాల దేవి జాన్ బాబు ఆర్ధిక సహాయం చేశారు. భవిష్యత్తులో అండగా ఉంటానని జాన్ బాబు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు తోట శ్రీనివాసరావు సుభానీ, శ్రీకాంత్, యర్రంశెట్టి వీరాస్వామి నాయుడు(తాత), యర్రంశెట్టి శ్రీనివాస్ రావు, కొండేటి వెంకటేశ్వరరావు, చాగంటి వెంకట స్వామి, చాగంటి లక్ష్మణ రావు తదితరులు పాల్గొన్నారు.

  • సూర్యకాంతం కుటుంబ సత్యనారాయణ సభ్యులను పరామర్శించిన జాన్ బాబు

పి.గన్నవరం నియోజకవర్గం: యర్రంశెట్టి వారిపాలెంకు చెందిన నారిన సూర్యకాంతం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు పెనుమాల దేవి జాన్ బాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు తోట శ్రీనివాసరావు, యర్రంశెట్టి వీరవెంకట సత్యనారాయణ(తాత), యర్రంశెట్టి వీరాస్వామి నాయుడు(తాత), యర్రంశెట్టి శ్రీనివాస్ రావు, కొండేటి వెంకటేశ్వరరావు, చాగంటి వెంకట స్వామి, చాగంటి లక్ష్మణ రావు తదితరులు పాల్గొన్నారు.